నిహారిక నిశ్చితార్థంలో అంద‌రూ ఉన్నా ప‌వ‌న్ క‌నిపించ‌డేం?

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు నిహారిక నిశ్చితార్థం చైత‌న్యతో వైభ‌వంగానే జ‌రిగింది. కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌లు పాటిస్తూ కొద్దిమంది బంధుమిత్రుల‌కే ఆహ్వానం ఉన్నా.. ఈ వేడుక‌లో మెగా సంద‌డి ఓ రేంజులోనే ఉంద‌ని తాజాగా రిలీజైన ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది.  నిశ్చితార్థంలో మెగా హీరోలంతా క‌నిపిస్తున్నా ఒక‌రు మాత్రం మిస్స‌య్యారు. ఆయ‌నే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఇక ఈ వేడుక‌లో చిరంజీవి, ప్ర‌భాస్ స‌హా రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా ఎంతో సందడి చేస్తూ క‌నిపించారు. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఎక్క‌డా ఏ ఫ్రేమ్ లోనూ క‌నిపించ‌డం లేదు.

ప‌వ‌న్ ప్ర‌తిసారీ ఇలానే చేస్తుంటారు. కుటుంబ ఫంక్ష‌న్లు అంటే పెద్దగా ప్రాధాన్య‌త‌నివ్వ‌ర‌ని కేవ‌లం అభిమానుల ఫంక్ష‌న్ల‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంటార‌ని ఓ సెక్ష‌న్ నుంచి గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ప‌వ‌న్ ఏదైనా బిజీలో ఉండి కుమార్తె నిశ్చితార్థ వేడుక‌కు రాలేక‌పోయారా?  లేక ఇంకేదైనా కార‌ణ‌మా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా ద‌ర్శ‌కులు వినిపించే క‌థ‌ల్ని వింటున్నార‌ని .. స్క్రిప్టుల్ని ఫైన‌ల్ చేసే పనిలో ఉండ‌డం వ‌ల్ల‌నే రాలేక‌పోయార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.