ప‌వ‌న్, మ‌హేష్ ఒకే ఫ్రేమ్‌లోనా.. క‌న్నుల పండుగే!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. ఈ ఇద్ద‌రినీ ఒకే వేదిక‌పై ఒకే ఫ్రేమ్ లో వీక్షించే అవ‌కాశం వ‌స్తే అది ఎలా ఉంటుంది? అంటే ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అభిమానుల‌కు అదో పెద్ద పండ‌గే. అయితే అలాంటి అరుదైన అవ‌కాశం వ‌స్తే బావుణ్ణు అని ఎదురు చూసే అభిమానులంద‌రికీ శుభ‌వార్త ఇది. ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకే వేదిక‌పైకి వ‌చ్చి ఫ్యాన్స్ కి క‌న్నుల పండ‌గ చేయ‌బోతున్నారు. అందుకు గ‌చ్చిబౌళి స్టేడియం వేదిక కానుంది.

ఇంత‌కీ సంద‌ర్భం ఏమిటి? అంటే.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్(టీసీపీఈయూ) స్థాపించి 25ఏళ్లు పూర్త‌యిన‌ సందర్భంగా సంస్థ రజతోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనుంది. సెప్టెంబ‌ర్ 8న గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని శాఖ‌ల ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అందాయ‌ని తెలుస్తోంది. ఈ వేడుక‌కు పెద్ద ఎత్తున సినీపెద్దలు హాజరు కాబోతున్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల త‌దిత‌రులు హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగిన‌ ఓ స‌మావేశంలో ఈ సంగ‌తిని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ప‌వ‌న్, మ‌హేష్ ల‌ను క‌లిస్తే వారి నుంచి అంగీకారం ల‌భించింద‌ని తెలిపారు.