అఫీషియల్ ఎనౌన్స్మెంట్…మాస్ కు మతిపోయే సినిమా

ఫ్యాన్స్‌కు  విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌!

రూమర్స్ నిజమయ్యాయి… ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోందంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. క్రేజీ కాంబినేషన్‌లో మీ ముందుకు సినిమా రాబోతోందంటూ.. పూరీ, విజయ్‌, ఛార్మి కలిసి దిగిన ఫొటోను నిర్మాణ సంస్థ పూరీ కనెక్స్ట్‌ షేర్‌ చేసింది. పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ట్వీట్‌ చేసింది. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ,

పూరీ జగన్నాథ్ చాలా ఏళ్ల తర్వాత రీసెంట్ గా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి హిట్‌ అందుకున్నారు. మరో ప్రక్క విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’తో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫ్లాఫ్ అయ్యింది. ఈ నేఫధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ప్రకటన రావటం ఆశ్చర్యకరమైన సంఘటనే.

దాంతో పూరి, విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉందని, దీన్ని ఊహించలేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే ఇప్పుడు వీరు చేయబోతున్నది ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెలా? లేక మరో కొత్త కథను ఎంచుకున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి డియర్ కామ్రేడ్ తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’లో విజయ్‌ నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించలేదు.