స‌ర్కారు వారి పాట‌లో ఆ హాట్ బ్యూటీ?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా స‌ర్కారు వారి పాట చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గీత‌గోవిందంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ప‌రుశురాం ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇదిమ‌హేష్ కి 27వ చిత్రం. దీంతో సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసుకుని షూటింగ్ కి వెళ్ల‌డానికి రెడీగా ఉంది. అయితే క‌రోనా క‌ల్లోలం ఇంకా అదుపులోకి రాక‌పోవ‌డంతో వెయిట్ చేస్తున్నారు. లాక్ డౌన్ 5.0 లో కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతున్న నేప‌థ్యంలో మ‌రో రెండు నెల‌ల పాటు ఆగట‌మే మంచిద‌ని యూనిట్ భావిస్తోంది.

ఇక స్ర్కిప్ట్ ప‌రంగా చిత్రీక‌ర‌ణ అమెరికాలో జ‌ర‌గాల్సి ఉండ‌గా ప‌రిస్థితులు బాగోలేని నేప‌థ్యంలో షూటింగ్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు హీరోయిన్ గా ఇటీవ‌లే కీర్తి సురేష్ ఫైన‌ల్ అయింది. చాలా మంది భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రికి కీర్తిని ఎంపిక చేసారు. తాజాగా స్ర్కిప్ట్ డిమాండ్ మేర‌కు మ‌రో హీరోయిన్ కు ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఆ పాత్ర‌కు కేర‌ళ కుట్టి నివేధా థామ‌స్ ని ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌ది తెలియాల్సి ఉంది. మ‌హేష్ తో ఛాన్స్ అందుకుంటే అమ్మ‌డికి ఇదే తొలి అవ‌కాశం అవుతుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న వ‌కీల్ సాబ్ లో న‌టిస్తోంది. అలాగే యువ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ కొత్త ప్రాజెక్ట్ లోనూ ఈ అమ్మ‌డి నే హీరోయిన్ గా ఎపిక చేసారు. మ‌రోవైపు సొగ‌స‌రి చేతిలో త‌మిళ్, క‌న్న‌డ సినిమాలున్నాయి. ఇలా వ‌రుస అవ‌కాశాల‌తో టాలీవుడ్ లో అన‌తి కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. ఇక అమ్మ‌డి పెర్పామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆరంభంలోనే అవార్డులు..రివార్డులు అందుకుంది. మాతృభాష‌లో రాష్ర్ట స్థాయి అవార్డుల‌ను సొంతం చేసుకుంది.