‘కొమరం పులి’ హీరోయిన్ కు సీక్రెట్ గా సర్జరీ

‘పులి’ ఫేమ్‌ నికిషా పటేల్‌ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళ చిత్రాలు చేయడం మొదలుపెట్టి, అక్కడ బిజీ అయ్యింది నికిషా. ఈ క్రమంలో ‘తలైవన్‌’, ‘కరైయోరం’, ‘నారదన్‌’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్’ వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం ఆమె.. జీవీ ప్రకాష్ సరసన ఓ కొత్త చిత్రలో చేస్తోంది. దర్శకుడు ఎలిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో నికిషా పటేల్ కి సీక్రెట్ గా ఆపరేషన్ జరిగిందని, ఎవరికీ తెలియనివ్వకుండా ముంబైలో సైలెంట్ గా ఆపరేషన్ కానిచ్చేశారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

తాజాగా నికిషా పటేల్ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని వెల్లడించింది. తనకు చిన్న సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు తొందరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

ఇక చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించనున్నారు. నికిషా టైటిల్‌ రోల్‌లో జానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్‌’. ఇందులో నికిషా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. రిస్కీ ఫైట్స్‌ని ధైర్యంగా చేసిందిట.