ప్లాఫ్ హీరోకు జగన్ తో ఏం పని? పనిగట్టుకుని వచ్చి మరీ…

గుర్తుందా?  ఆ మధ్యన కన్నడ ముఖ్యమంత్రి కుమారుడుతో జాగ్వర్ అనే ప్లాప్ సినిమా వచ్చింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అయిన హీ నిఖిల్ గౌడ . అతను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు కావటంతో ..మొన్నఎలక్షన్స్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించున్నాడు.

ప్రముఖ నటుడు కాంగ్రెస్ నేత భార్య సుమలత తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబడింది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయాడు ఈ ఫ్లాఫ్ హీరో. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అమరావతిలో ప్రత్యక్షం అయ్యి తెలుగు మీడియాలోనూ వార్త అయ్యారు.

నిఖిల్ గౌడ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక ఆలోచన ఏమిటి ఎవరికీ తెలియరాలేదు. భేటి అనంతరం వైఎస్‌ జగన్‌ రాజకీయ పోరాటం తన వంటి యంగ్ లీడర్స్ కు స్ఫూర్తిదాయకమని అన్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో జగన్‌ను కలిసిన ఫొటోలను ఆయన తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

రాజకీయాలలో ఫెయిలైన నిఖిల్ మళ్ళీ సినిమాల తన లక్ ని పరీక్షించుకోవటానికి సిద్దపడుతున్నారు. రజినీకాంత్ తో 2.0 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ నిఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన పనులు ప్రారంభం కానున్నాయి.