శిల్పాజీ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారా…?

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నెటిజన్ల ట్రోలింగ్ కు బలి అయింది. తన కొడుకు వియాన్ తో కలిసి శిల్పా శెట్టి  నడుస్తోన్న ఫోటో పై  నెటిజన్లు మండిపడుతున్నారు. కేవలం కుర్తా మాత్రమే ధరించినట్లు కనబడుతోన్న డ్రెస్ ను వేసుకున్న శిల్పా పై  నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్యాంటు  వేసుకోవడం మరచిపోయావా అంటూ మండిపడుతున్నారు.

అయితే ఆ కుర్తా స్టైలే అంతో… లేకుంటే…. శిల్పా ఫ్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందో తెలీదు గాని చూడ్డానికి అది అసభ్యకరంగా కనిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. శిల్పాజీ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారా ..అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీరు ఒక కొడుకుకు తల్లి అనే విషయం గుర్తుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పక్కన పిల్లవాడిని  పెట్టుకొని ఇటువంటి డ్రెస్ లు వేసుకొని బయటకు వస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇంట్లో వేసుకోవాల్సిన నైట్ డ్రెస్ లు  రోడ్లపై వేసుకొని వస్తే ఎలా అని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆ పొడుగు కాళ్ళ సుందరికి ట్రోలింగ్ కొత్తేమికాదు. గతంలో కూడా శిల్పా డ్రెస్ పై కామెంట్స్ వచ్చాయి. అయితే తాజాగా డ్రెస్ ట్రోలింగ్ పై శిల్పాకు  కొంతమంది మద్దతు తెలపడం విశేషం. ఆమె ఏ దుస్తులు ధరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని కొంత మంది శిల్పా కు వంత పడుతున్నారు.