పవన్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.అయితే అలాంటి సబ్జెక్టు బాలయ్యతో పడితే ఓ రేంజిలో ఉంటుందని అప్పట్లో బాలయ్య అభిమానులు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు వారి ఆశలు నెరవేరే సమయం వచ్చింది.
ప్రస్తుతం తన తండ్రి బయోపిక్ ‘ఎన్టీఆర్’ సినిమా సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమాకు బాలయ్య లైన్ క్లియర్ చేసాడనే టాక్ వినిపిస్తుంది. పటాస్ ఫేం అనీల్ రావిపూడి రీసెంట్ గా బాలయ్యని కలిసి రామారావుగారు పేరుతో రెడీ చేసుకున్న కథని వినిపించగా, దీనికి ఇంప్రెస్ అయిన బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టుగా చేద్దామని చెప్పాడట. అనీల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్,వరుణ్ తేజ నటిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. గుంటూరు పంపిణీదారులు వాసవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణంలో రూపొందనున్నట్టు టాక్.
అన్ని అనుకున్నట్లు జరిగితే 2019 ప్రధమార్దంలో ప్రాజెక్టు మొదలవుతుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. బాలయ్య లోని మాస్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ ఈ సినిమా రూపొందించాలని అనీల్ రావిపూడి భావిస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్య…పోలీస్ అధికారిగా కనిపిస్తారని, డ్యూయిర్ రోల్ అని చెప్తున్నారు.
అనీల్ రావిపూడి మార్క్ ఫన్ ఉంటూనే, బాలయ్య మార్క్ సీన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. బాలయ్యకు ఇది ఓ గబ్బర్ సింగ్ లాంటి సినిమా అవుతుందని వినపడుతోంది. ఈ వార్తలకి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
