చూస్తే… మణిరత్నం మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడంటారు

(సూర్యం)

చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ  దర్శకుడు మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం నవాబ్‌. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ కి రెడీ చేస్తున్నారు.  గాఢ్ ఫాధర్ తరహా కథ,కథనం రెడీ అవుతున్నట్లు అనిపించే ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి. ట్రైలర్ మొత్తం పూర్తి యాక్షన్ తో సాగింది.

ట్రైలర్ ప్రారంభమై పెద్దాయన చనిపోయినట్లు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన సామ్రాజ్యానికి వారసుడు పోటి ఉన్నట్లు అర్దమవుతుంది. అరవింద్ స్వామి ఆ వారసుడు గా ముందుకు వస్తాడు. అయితే పెద్దాయన మృతిపై శింబుకు అనుమానం వస్తుంది. అక్కడ నుంచి అన్నదమ్ముల క్లాష్ గా కథ టర్న్ తీసుకుంటుంది.

ఇక అరవింద్ స్వామి వెంటేడే పోలీస్ అధికారిగా విజయ్ సేతుపతి కనిపిస్తారు. సంతోష్ శివన్ సూపర్బ్ విజువల్స్ తో ప్రాణం పోస్తే..రెహమాన్ నేపధ్య సంగీతం జీవం పోసింది.  ఈ సినిమాలో జోతిక, ఐశ్వర్యరాజేష్‌, డయానా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయం చెప్పండి.