అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున  సినిమా చేయ‌నున్నాడా?

ఈ ఏడాది విడుద‌లైన చిన్న చిత్రం `ఆర్‌.ఎక్స్ 100` సినిమా చూసి … అబ్బే ఇదేం సినిమా .. అని విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచినా.. ప్రేక్ష‌కులు మాత్రం ప‌ట్టం క‌ట్టారు. నాలుగు కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా దాదాపు ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్‌ అజ‌య్ భూప‌తి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ అయ్యాడు. చాలా మంది ఈయ‌న‌తో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో అజ‌య్ భూప‌తి.. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ రీసెంట్‌గా అన్న‌పూర్ణ స్టూడియో వెళ్లి నాగార్జున క‌లిశారు. అస‌లు ఈ ఇద్ద‌రు నాగార్జున‌ని ఎందుకు క‌లిశారు.. అనే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున  సినిమా చేయ‌నున్నాడా!  ఈ సినిమాను కూడా అశోక్ రెడ్డి గుమ్మ కొండ నిర్మిస్తాడా అనే ఓ కోణంలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. `ఆర్.ఎక్స్ 100`లో చివ‌రి రెండు రీళ్లు మాత్ర‌మే చూసిన నాగార్జున సినిమా చాలా బావుందంటూ ప్ర‌శంసించారు. అదీగాక కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి నాగ్ ఎప్పుడూ ముందుంటారు. అందులో అజ‌య్ భూప‌తి వ‌ర్మ శిష్యుడు కాబ‌ట్టి నాగార్జున‌ను సుల‌భంగానే క‌లిసి ఉంటాడు. క‌లిసి పూర్తి `ఆర్.ఎక్స్ 100` సినిమా చూపించి ఉంటారా?  లేక నాగార్జున‌కు క‌థేమైనా వినిపించి ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. అక్కినేని కాంపౌండ్‌లో నాగ‌చైత‌న్య అక్కినేని ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి చైత‌న్య‌తో ఇప్ప‌ట్లో సినిమా చేసే అవ‌కాశం లేదు. ఒక‌వేళ అజ‌య్ భూప‌తి నాగార్జున‌కి క‌థ చెప్పారా?  లేక అఖిల్‌కు క‌థ చెప్పారా?  అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.