మ‌ర్డ‌ర్ పోస్ట‌ర్ : ఆ బేబి ఎవ‌రు వ‌ర్మా?

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. వివాదం లేని విష‌యంలో వర్మ వేలు పెట్ట‌డు. తాజాగా మ‌రోసారి రియ‌ల్ స్టోరీ ఆధారంగా వ‌ర్మ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల‌గూడ ప్ర‌ణ‌య్-అమృత ప్రేమ‌క‌థ ‌.. మారుతిరా వు ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్` అనే టైటిల్ లో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌క‌పోయినా, ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే అంతా జ‌రుగుతోంది. ఇటీవ‌లే ఆ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రివీల్ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. పోస్ట‌ర్ తోనే వివాదానికి తెర‌లేపారు. తండ్రి బిడ్డ‌ను ప్రేమ‌గా చూసుకుంటోన్న ఫోటోని రిలీజ్ చేసారు.

ఆ పోస్ట‌ర్ చూసిన అమృత తీవ్రంగా ఖండించింది. వ‌ర్మ‌ను చూస్తే జాలేస్తుంద‌ని, ఇలాంటి క‌థ‌ల‌తో సినిమాలు త‌గునా? అని ప్ర‌శ్నించింది. వ‌ర్మ అంద‌కు రిప్లై ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌తీ స‌మ‌స్య‌కు ఓ కార‌ణం ఉంటుంద‌ని, అమృత‌ని ప‌రిస్థితులే అలా మార్చాయంటూ బ‌ధులిచ్చారు. తాజాగా వ‌ర్మ ఆ సినిమా సెకెండ్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. ఈసారి త‌ల్లి బిడ్డ‌ను ప్రేమ‌గా చూసుకుంటోన్న ఫోటోని రిలీజ్ చేసారు. భ‌ర్త‌ను కోల్పోయిన భార్య‌..బిడ్డ‌తో మీడియా ముందు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న దానిని హైలైట్ చేసారు. ‘ఈ పిక్చర్‌లో నటి ఆవంచ సాహితి పండించిన ఎమోషన్ అద్భుతంగ ఉందని పేర్కొన్నాడు’ వ‌ర్మ‌.

ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ‌రి దీనిపై అమృత మళ్లీ స్పందిస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే ఈ సినిమాకు సంబంధించి వ‌ర్మ‌పై ఎలాంటి కేసు వేయ‌న‌ని…ప‌ళ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్న‌ట్లు స్పందించింది. కాబ‌ట్టి వ‌ర్మ ఆ విష‌యంలో నిశ్చింత‌గా ఉండొచ్చు. ఈ చిత్రాన్ని నట్టి కరుణ, నట్టి క్రాంతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.