AP: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పార్టీలు 164 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని అందుకున్నాయి. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొంతమంది సీనియర్ నాయకులు తమ సీట్లను కూడా త్యాగం చేసుకున్నారని చెప్పాలి. పొత్తులో భాగంగా చాలా మంది సీనియర్లు గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఒకరు.
ఈ నియోజకవర్గము నుంచి వర్మ పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వర్మ తప్పనిసరి పరిస్థితులలో తప్పుకోవాల్సి వచ్చింది.. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాలని చంద్రబాబు నాయుడు చెప్పడంతోనే వర్మ పవన్ గెలుపుకు కృషి చేశారు అయితే పవన్ గెలిచిన తర్వాత వర్మను పట్టించుకునే వారు లేకుండా పోయారు.
ఇలా పిఠాపురంలో వర్మకు తరచు అవమానాలు ఎదురవుతూ వస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీ కోసం కష్టపడుతూ ఇప్పటికీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రైతులకు వ్యవసాయ పనిముట్లు మహిళలకు కుట్టు మిషన్లను సరఫరా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు వర్మ పాల్గొన్నప్పటికీ ఆయనకు అడుగడుగున అవమానం ఎదురైందని తెలుస్తోంది.
టీడీపీ నేత వర్మ అక్కడకు వస్తున్న క్రమంలో పోలీసులు వీఐపీలకు అనుమతి లేదంటూ ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వర్మ మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం గురించి వర్మ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.రాష్ట్రంలో ఇంకా YSRCP అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి.. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా.. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నాం’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీసులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి.