(సూర్యం)
మొన్నామధ్య జనతాగ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు కీలకపాత్రలో కనిపించిన మోహన్ లాల్ …మళయాళంలో మెగాస్టార్. ఆయన ప్రధాన మంత్రి అంటూ మళయాళ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ మన మీడియా సైతం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అదేంటి ఆయన అభిమానుల ఎవరైనా ఆ హోర్డింగ్ లు పెట్టారా అంటే అబ్బే…అంత సీన్ లేదు..అసలేం జరిగిందో చూద్దాం…
మోహన్ లాల్ ఓ పాత్ర వేస్తున్నారంటే మీడియా మొత్తం అటెన్షన్ లో ఉంటుంది. తాజాగా ఆయన ప్రధానమంత్రి పాత్రలో కనిపించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆ పాత్రను హైలెట్ చేయటానికి షూటింగ్ భాగంగా కొన్ని హోర్డింగ్ లు తయారు చేయించి, వాటి ఫొటోలు వదిలారు. సినిమాకు పబ్లిసిటీ వస్తుందనుకుని వదిలిన ఆ ఫొటోలు ఇప్పుడు మోహన్ లాల్ కావాలనే తను ప్రధాన మంత్రిగా కనిపించాలనే కోరికతో
పెట్టింకున్నారంటూ విమర్శలకు దారి తీసేలా చేసాయి. అయినా జనం ఎప్పుడూ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు కాబట్టి మోహన్ లాల్ లైట్.
ఆ సినిమా వివరాలు చూస్తే…. ప్రముఖ తమిళ దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేస్తున్నాడు మోహన్ లాల్. సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోండగా, ఆర్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ చంద్రకాంత్ వర్మ అనే పాత్రలో ప్రధాన మంత్రిగా కనిపించనున్నాడట.
ఆయనకి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల సూర్యకి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకి రాగా, ఇందులో సూర్య సరికొత్త లుక్లో కనిపించాడు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. బొమన్ ఇరానీ, అల్లు శిరీష్ కూడా చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.