ర‌కుల్‌ని మార్చేసిన ‘మిస్ ఇండియా’

తెలుగులో టాప్ హీరోయిన్స్ రేసులో దూసుకుపోతోంది రకుల్ ప్రీత్. తాజాగా తన వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలిపింది ఈ పంజాబీ భామ. తాను పాల్గొన్న ‘మిస్ ఇండియా కాంపిటీషన్’ తనని ఎలాంటి వ్యక్తిగా మార్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

‘మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నప్పుడు ఆ టైటిల్ గెలవడమే నా ప్రధాన లక్ష్యం. ఆ పోటీ నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే నన్ను సంపూలంగా మార్చింది. నా మాట తీరు, ప్రవర్తన, ఆలోచనా విధానం ఇలా అన్నీ మారిపోయాయి. పోటీ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? అప్పుడే తెలిసింది. మనం ఎప్పుడైతే ప్రతిభ ఉన్న వ్యక్తులను కలుస్తామో, వాళ్ళని గమనిస్తామో అప్పుడే మనకి ఎంత కష్టపడాలని అర్ధమవుతుంది. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోకి కొత్తవారు వస్తే భయపడను. వారు విజయాలు సాధిస్తుంటే పోటీ అనుకోను. ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన టైమ్ వచ్చింది అనుకుంటాను’ అని చెప్పింది రకుల్.

మిస్ ఇండియా కాంపిటిషన్లలో మిస్ ఇండియా టైటిల్ గెలవనప్పటికీ ఐదవ స్థానంలో నిలిచి ఐదు పెజెంట్ టైటిల్స్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.