పొలిటిక‌ల్ డ్రామా మూవీలో మెగాస్టార్

Megastar Chiranjeevi

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `లూసిఫ‌ర్` తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమా అనువాద‌ హ‌క్కుల్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ చేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు సైరా మ‌ల‌యాళ ప్ర‌మోష‌న్స్ లో లూసిఫ‌ర్ ద‌ర్శ‌కుడు పృథ్వీ రాజ్ టాప్ సీక్రెట్ ని వెల్ల‌డించారు.

లూసిఫ‌ర్ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తిక‌ర యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో మోహ‌న్ లాల్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఒక గ్యారేజ్ ఓన‌ర్ లా క‌నిపించే లాల్ కి రాజ‌కీయంగా ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది ఆస‌క్తిక‌రం. అయితే ఈ సినిమా మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయినంత‌గా తెలుగులో ఆడ‌లేదు. అందుకే ఇక్క‌డ ఆడియెన్ కి పెద్ద‌గా తెలీదు. తాజా స‌మ‌చారం ప్ర‌కారం.. మెగాస్టార్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు ఈ సినిమా క‌థాంశాన్ని తెలుగైజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. తెలుగు వెర్ష‌న్ కి ఒరిజిన‌ల్ కి ప‌ని చేసిన పృథ్వీనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? చిరు స‌న్నిహిత ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. చిరు ప్ర‌స్తుతం సైరా రిలీజ్ టెన్ష‌న్స్ లో ఉన్నారు. ఆ త‌ర్వాత కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమాలో న‌టించ‌నున్నారు. ఈలోగానే లూసిఫ‌ర్ రీమేక్ కిసంబంధించిన పనులు సాగనున్నాయ‌ని తెలుస్తోంది.