చిరు వ‌ర్సెస్ మ‌హేష్ .. ఎవ‌రు వార్‌లో విజేత‌?

ప్రజలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మొత్తం దేశం లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇది అన్ని కార్యకలాపాలకు చెక్ పెట్టేసింది. అన్ని పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనివ‌ల్ల‌ ముఖ్యంగా టాలీవుడ్ ఎక్కువగా నష్టపోతోంది. ప్ర‌స్తుతం టాప్ టాలీవుడ్ తారలు స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే తమ వ్య‌క్తిగ‌త‌ వీడియోలు, రహస్యాల్ని సోషల్ మీడియాలో పంచుకోవడంలో బిజీగా ఉన్నారు. కరోనావైరస్ తో పోరాటంపై ప్రజలలో అవగాహన కల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ల‌లో మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ సామాజిక మాధ్య‌మాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. లాక్ డౌన్ వ్యవధిలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహేష్ బాబు .. ఇదే స‌మ‌యంలో సోషల్ మీడియాలోకి ప్రవేశించిన చిరంజీవి తనదైన శైలిలో జెట్ స్పీడ్ తో స‌మాచారాన్ని అందిస్తూ ర‌క‌ర‌కాల అంశాల్ని ప్ర‌స్థావిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

చిరు స్పీడ్ పై విమర్శలు ఉన్నా.. ఆయ‌న ఎందులోనూ వెనక్కి తగ్గడం లేదు. చిరంజీవి .. మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేమికులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. ర‌క‌ర‌కాల రహస్యాలు పంచుకోవడం ద్వారా ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో, చిరంజీవి – మహేష్ బాబులలో ఎవరు లాక్ డౌన్ వార్ లో విన్న‌ర్? అంటూ ఫ్యాన్స్ లో డిబేట్ న‌డుస్తోంది. చివ‌రికి ఎవరు గెలిచినా అంతిమంగా ఆ ఇద్ద‌రూ చాలా వినోదాన్ని అందరికీ అందిస్తున్నారని హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.