‘మీటూ’లో ఊహించని ట్విస్ట్..’రోబో 2′ నటిపై ఆరోపణలు

దేశమంతటా ఇప్పుడు మీటూ ఉద్యమం తీవ్ర స్దాయిలో  జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది పెద్దవాళ్లు ఈ మీటూ దెబ్బకు పిట్టలు రాలినట్లు గౌరవం కోల్పోతున్నారు. అయితే అదేసమయంలో మీటూ ఉద్యమంపై రకరకాల ఆరోపణలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విషయం మాత్రం మీటూ ఉద్యమానికే కొత్తది. అసలు ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఎవరూ ఊహించరు.

విషయంలోకి వెళ్తే.. ఇప్పటివరకు మీటులో మగవారిపైనే లైంగిక ఆరోపణలు రాగా, ఇప్పుడు మహిళపైనా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. సహనటిపై ‘మీటూ’ ఆరోపణలు చేయడం.. తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. సినీ రంగంలో లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ సాగుతున్న ‘మీటూ’ ఉద్యమానికి ఇది కొత్త విషయం.

Photo courtesy- ananya ramaprasad/ Facebook)

తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం “2.O”లో చిన్నపాత్రను పోషించిన నటి మాయా ఎస్. కృష్ణన్‌పై మరో సినీ నటి అనన్య రాంప్రసాద్ లైంగిక ఆరోపణలు చేసింది. లెస్బియన్‌ రిలేషన్‌కు తనను బలవంతపెట్టిందని తీవ్ర ఆరోపణలు చేయడం తమిళ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

మాయ… ఎస్. కృష్ణన్‌ ‘తొడరి’, ‘మగళిర్‌ మట్టుమ్‌’, ‘వేట్టైక్కారన్‌’ తదితర చిత్రాల్లో ఈమె నటించగా, త్వరలో విడుదల కాబోతున్న రజనీకాంత్‌ ‘2.ఓ’లోను చిన్న పాత్ర పోషించింది.