“మార్కెట్‌” చిత్రం మొద‌లైంది

మూవీ మొఘ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అజ‌ర్ షేక్ నిర్మిస్తోన్న‌ చిత్రం మార్కెట్‌. దాస‌రి గంగాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ  చిత్రంలో కిషోర్‌, దివ్య హీరో జంటగా న‌టిస్తున్నారు.  ఈ చిత్ర ప్రారంభోత్స‌వం  రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశ‌లో ద‌ర్శ‌కుడు గంగాధ‌ర్ మాట్లాడుతూ….  ఇది నా మొద‌టి సినిమా ,  ప్ర‌తి ఊరిలోను నేర చ‌రిత్ర ఉంటుంది. రాత్రి స‌మయంలో జ‌రిగే క్రైమ్ సంఘటనలను తీసుకుని ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచానికి తెలియని నేర సామ్రాజాన్ని చూపించ‌డ‌మే ఈ చిత్ర క‌థాంశం అని అన్నారు.

నిర్మాత అజ‌ర్ షేక్ మాట్లాడుతూ… సినిమాల్లో నా మొద‌టి ప్ర‌యాణం గంగాధ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. మీరంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో సినిమా మొత్తం పూర్తి చేసి మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు.

దివ్య మాట్లాడుతూ… నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత దర్శకుడుకి  నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో మేమంద‌రం కొత్త‌వాళ్ళం మాకుమీ స‌పోర్ట్ త‌ప్ప‌క కావాలి. అంద‌రూ మమ్మ‌ల్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.