రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం ఘన విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు సుకుమార్. మరో ప్రక్క భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మహేష్ బాబు మరో సూపర్ హిట్ కు రంగం సిద్దపడుతున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుంది. అయితే గతంలో వీరిద్దరి కాంబోలో 1 నేనొక్కడినే అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.
దాంతో ఎలాగైనా ఈ సారి మహేష్ కు సూపర్ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు సుకుమార్. ఈ మేరకు స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే మరి ఈసారి మహేష్ కు రెడీ చేసే సినిమా ఏ నేపధ్యంలో రూపొందబోతోందనేది ఆసక్తికరం. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ఈ చిత్రం తెలంగాణా స్లాంగ్ లో సాగే చిత్రం అని తెలుస్తోంది.
తెలంగాణాలో ఓ చిన్న టౌన్ కు చెందిన ఓ కుర్రాడిగా మహేష్ కనపడనున్నారట. అర్జున్ రెడ్డిలాగ పూర్తి తెలంగాణా యాసలో సినిమా సాగనుందని సమాచారం. రీసెంట్ గా మహేష్ బాబుకి బ్రీఫ్గా లైన్ వినిపించాడట సుకుమార్. ఆ లైన్ మహేష్కి ఎంతో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి డీటైల్స్ వెల్లడించనున్నారు. ఈ ప్రాజెక్ట్పై చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట సుకుమార్. పక్కా స్క్రిప్ట్తో సెట్స్ పైకి వెళ్ళేందుకు కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన సుక్కూ 2019లో మూవీ విడుదల చేయనున్నాడట. సంగీత దర్శకుడిగా మరోసారి తన సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ని ఎంపిక చేశాడని తెలుస్తుంది.