మ‌హేష్ 27వ సినిమా జ‌న‌వ‌రిలో స్టార్ట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ 26వ సినిమా ఇది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌హేష్ తొలిసారి ఓ ఆర్మీ అధికారి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. విజ‌య‌శాంతి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. న‌వంబ‌ర్ నాటికి ఈ సినిమా టాకీ పూర్త‌వుతుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.

మ‌హేష్ #SSMB27 అప్పుడే వేడి మొద‌లు..

తాజాగా మ‌హేష్ న‌టించే 27వ సినిమాకి సంబంధించి తాజాగా ఓ హాట్ అప్ డేట్ తెలిసింది. మ‌హేష్ న‌టించే 27వ సినిమా 2020 జ‌న‌వ‌రి మూడో వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ తో క‌లిసి కొర‌టాల శివ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తారు. 7 ఆగ‌స్ట్ 2020 రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. అయితే #SSMB27 టీమ్ అధికారికంగా వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉంది.