న్యూయార్క్ నగరంలో మహేష్ విహారం

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం  న్యూయార్క్ లో  జరుగుతుంది . తన భార్య నమ్రత , పిల్లలు గౌతమ్ ,సితార  ముగ్గురు కూడా న్యూయార్క్  వెళ్లారు . ప్రతి సినిమా పూర్తి చేసిన తరువాత మహేష్ కు కుటుంబంతో గడపడం అనేది ఆనవాయితీగా వస్తుంది . ఎప్పుడు షూటింగ్ తో వుండే మహేష్ కుటుంబంతో  గడిపే సమయం తక్కువగా ఉంటుంది . అందుకే ఆ లోటు పూర్తి చేయడానికి మహేష్
కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తారు. 

ఒక్కోసారి ఒక్కో ప్రదేశాన్ని ఎంచుకొని సరదాగా భార్యా  పిల్లలతో గడుపుతుంటాడు. అయితే ఈసారి తన చిత్రం “మహర్షి “న్యూయార్కులో జరుగుతుంది .పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు  వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేష్ తన కుటుంబాన్ని అక్కడికే పిలిపించుకున్నాడు. షూటింగ్ లేనప్పుడు వారితో కలసి న్యూయార్క్  వీధుల్లో విహరిస్తున్నాడు.