సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతుంది . తన భార్య నమ్రత , పిల్లలు గౌతమ్ ,సితార ముగ్గురు కూడా న్యూయార్క్ వెళ్లారు . ప్రతి సినిమా పూర్తి చేసిన తరువాత మహేష్ కు కుటుంబంతో గడపడం అనేది ఆనవాయితీగా వస్తుంది . ఎప్పుడు షూటింగ్ తో వుండే మహేష్ కుటుంబంతో గడిపే సమయం తక్కువగా ఉంటుంది . అందుకే ఆ లోటు పూర్తి చేయడానికి మహేష్
కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తారు.

ఒక్కోసారి ఒక్కో ప్రదేశాన్ని ఎంచుకొని సరదాగా భార్యా పిల్లలతో గడుపుతుంటాడు. అయితే ఈసారి తన చిత్రం “మహర్షి “న్యూయార్కులో జరుగుతుంది .పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేష్ తన కుటుంబాన్ని అక్కడికే పిలిపించుకున్నాడు. షూటింగ్ లేనప్పుడు వారితో కలసి న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్నాడు.

