1980లోకి జనాలను తీసుకెళ్లి రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ అంటూ హిట్ ఇచ్చారు సుకుమార్. ఇప్పుడు మహేష్ బాబును సైతం ఆయన అరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథను సుకుమార్ రెడీ చేస్తున్నారని టాక్.

అయితే సుకుమార్ అంత తెలివితక్కువుగా ఎందుకు ఉంటాడు..ఒక సినిమా పీరియడ్ లుక్ తో హిట్ అయ్యిందని, మళ్ళీ అలాంటిదే ట్రై చేసి తన పేరుని తనే ఎందుకు బద్నామ్ చేసుకుంటాడు..ఇవన్ని రూమర్సే అని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇక మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం మహేశ్బాబు –సుకుమార్ కాంబినేషన్లో ‘1:నేనొక్కడినే’ చిత్రం వచ్చి ప్లాఫ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో
రూపొందనున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

