మరాఠి సూపర్ హిట్ రీమేక్ లో కృష్ణవంశీ !

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఏకైక దర్శకుడు ‘కృష్ణ వంశీ’.అయితే ఆయన్ని గత కొన్ని సంవత్సరాలుగా భాక్సాఫీస్ కరుణించటం లేదు. వరస ఫ్లాప్ ల్లో నిర్మాతలకు భయం పుట్టిస్తున్నారు ఆయన. కృష్ణవంశీతో సినిమా అంటే ఒకప్పుడు హీరోలు ఉత్సాహం చూపించేవారు. ఇప్పుడా పరిస్దితి లేదు.

కృష్ణవంశీ నుంచి మినిమం హిట్ కాదు కదా కనీసం యావరేజ్ సినిమాను కూడ తీయలేకపోతున్నారు. దాంతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు , తిరిగి మళ్లీ దర్శకుడుగా నిలబడేందుకు గానూ ఆయన మరాఠి రీమేక్ చేయాలని డెసిషన్ కు వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రగా మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని కృష్ణ వంశీ తెలుగులోకి రీమేక్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇంకా అఫీషియల్ సమాచారం ఏదీ లేదు.

మరాఠీలో నానా పటేకర్ చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలని కృష్ణ వంశీ భావిస్తున్నారట. ఆ పాత్ర చుట్టూతానే కథ తిరుగుతుంది. ఈ రీమేక్ కథతోనైనా కృష్ణ వంశీ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో అని అభిమానులు ఆశపడుతున్నారు.