చెన్నైలో శ్రీరెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది

తమిళ దర్శకుడు సుందర్ సి గట్టి షాక్ ఇచ్చారు శ్రీరెడ్డికి. తెలుగు లీక్స్ అయ్యాక తమిళ లీక్స్ అంటూ కోలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఏఆర్ మురుగదాస్, శ్రీకాంత్, రాఘవ లారెన్స్ నాకు అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకుని వదిలేశారని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత హీరోయిన్ ఖుష్బూ భర్త సుందర్ సి గురించి ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టింది.

అరణ్మనై సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసాడు. నేను షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తర్వాత అతను నాకు డైరెక్టర్ సుందర్ సి సార్ ని పరిచయం చేశాడు. ఆరోజు అతను నువ్వు తన నెక్స్ట్ ప్రాజెక్టులో ఖచ్చితంగా ఉంటావు అని కన్విన్స్ చేశాడు. తర్వాతి రోజు నోవాటెల్ హోటల్ కి రమ్మని పిలిచారు. తన నెక్స్ట్ మూవీలో ఉండాలంటే నన్ను కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు. తరువాత ఏమైందో పెరుమాళ్ళకే తెలియాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక ఫ్రాడ్ అని పోస్ట్ పెట్టింది.

ఈ పోస్టుపై స్పందించారు డైరెక్టర్ సుందర్ సి. తన మాటల్లో వాస్తవం లేదని, ఆమె చెబుతున్నవి అబద్ధాలని కొట్టి పారేసారు. ఈ విధంగా అబద్దపు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డిపై కేసు పెడతానని తెలియజేసారు. దీని గురించి న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది.