కియ‌రాకి కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌ట‌

Kiara Advani

టెన్ష‌న్ పెట్టేసిన హ్యాక‌ర్లు

భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించింది కియ‌రా అద్వాణీ. ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్.. ఇంకొక‌టి డిజాస్ట‌ర్. ఆ రెండో ఫ‌లితం అమ్మ‌డిని చాలానే క‌ల‌వ‌ర పెట్టింది. అందుకే ఇక్క‌డ ఐరెన్ లెగ్ అనిపించుకోవ‌డం ఇష్టం లేక పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది. ప్ర‌స్తుతం అక్క‌డ వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉంది. కిలాడీ అక్ష‌య్ కుమార్ సర‌స‌న‌ ల‌క్ష్మీ బాంబ్ చిత్రంలో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు భూల్ భుల‌య్యా సీక్వెల్లోనూ న‌టిస్తోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న షేర్ షా అనే చిత్రంలో న‌టించ‌నుంది. ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ గిల్టీలోనూ కీల‌క పాత్ర పోషిస్తోంది.

అయితే ఇంత బిజీలోనూ ట్విట్ట‌ర్, ఇన్ స్టా స‌హా సోష‌ల్ మీడియాల్లో కియరా ఎంతో యాక్టివ్ గా త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటోంది. రెగ్యుల‌ర్ గా త‌న ఫోటోషూట్ల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తోంది. అయితే ఉన్నట్టుండి త‌న ట్విట్ట‌ర్ ఖాతాను ఎవ‌రో హ్యాక్ చేయ‌డంతో ఖంగు తిన్న కియ‌రా తెగ టెన్ష‌న్ కి గుర‌వుతోంద‌ట‌. అందులో పోస్ట్ చేస్తున్న లింకులేవీ త‌న‌వి కాద‌ని ఇప్ప‌టికే ఫ్యాన్స్ కి చెప్పింది. ప్ర‌స్తుతం హ్యాక‌ర్ల భారి నుంచి రిక‌వ‌రీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కాస్త స‌హ‌నం వ‌హించండి అంటూ కియ‌రా క్లియ‌ర్ క‌ట్ గా చెప్పింది. మొత్తానికి హ్యాక‌ర్లు అమ్మ‌డిని మ‌రీ ఇంత‌గా ఇబ్బంది పెడతార‌న్న‌ది ఊహించ‌నిది.