విజయ నిర్మల మనవడు సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు . ఈ చిత్రంలో కీర్తి సురేష్ ను నాయికగా ఎంపిక చేశారు .

ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల రాంప్రసాద్ రగుతు దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది , సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు , డి. రామానాయుడు, రాఘవేంద్ర రావు తదితరులంతా హాజరయ్యారు . అంగరంగ వైభోగంగా మొదలైంది . ఈ సినిమాకు “ఐనా ఇష్టం నువ్వు “అనే పేరు పెట్టారు . షూటింగ్ కూడా చాలా భాగం అయిపొయింది . అయితే నిర్మాత చంటి అడ్డాల ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చెయ్యలేకపోయాడు .

విజయ నిర్మల కానీ నరేష్ కానీ తనకు ఆర్ధికంగా సహాయ పడతాడని చంటి ఎదురు చూశాడు . కానీ వారి నుంచి ఎలాంటి సంకేతాలు రాక పోవడంతో ..షూటింగ్ వాయిదాలు వేస్తూ వచ్చాడు . తన తోలి సినిమా విడుదల కాకపోవడంతో ఆమె కొంత నిరాశకు గురయ్యింది . అదే సమయంలో “నేను -శైలజ ” అనే సినిమాలో రామ్ ప్రక్కన అవకాశం రావడంతో ఒప్పుకుంది . ఎవరు అడిగినా అదే తన తొలి సినిమా అని చెబుతుంది . మహానటి సినిమాతో నిజంగానే “కీర్తి ” సురేష్ సార్ధక నామధేయురాలు అయ్యింది . “ఐనా ఇష్టం నువ్వు ” సినిమాను నవంబర్ 18 న విడుదల చేస్తామని నిర్మాత చంటి ప్రకటిస్తున్నాడు .
