విజయవాడకు మకాం మార్చిన కత్తి మహేశ్

సంచలనాల సినీ క్రిటిక్ కత్తి మహేష్ మకాం విజయవాడకు మార్చారు.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

రామాయణ పాత్రల  మీద చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా ఆయనను హైదరాబాద్ పోలీసులు నగరం నుంచి బహిష్కరంచిన సంగతి తెలిసిందే.

ఆయన ఇంతవరకు తన సొంత జిల్లా చిత్తూరులో ఉండేవారు. 

ఇకనుంచి తాను ఇక నుండి విజయవాడ లోనే ఉండాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఆయన  విజయవాడ చేరుకున్నారు.  గన్నవరం విమానాశ్రయం కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.

‘నేను అంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తిననే  నామీద నిషేధం విధించారు అయితే, నామీద హైదరాబాదు సిటి పరిధిలోకి మాత్రమే నిషేధం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు లో కాకుండా ఇంకా ఎక్కడైనా నివసించవచ్చునని ఆయన అన్నారు. నేను అంధ్రప్రదేశ్ వాడిని కాబట్టి ఇక నుండి విజయవాడ లో ఉండటానికి ఇక్కడకు చేరుకున్నాను,’అని ఆయన చెప్పారు.