వైరల్ వీడియో: అక్కడ తమన్నా, కాజల్‌ డ్యాన్స్

స్టార్ హీరోయిన్స్ కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితిరావు హైదరి కలిసి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సోమవారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి విశిష్టత గురించి వాసుదేవ్‌ ప్రసంగాలు చేశారు. అనంతరం రాత్రంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో కాజల్‌, ఆమె సోదరి ఇషా అగర్వాల్‌‌, తమన్నా, వాసుదేవ్‌ కలిసి డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి కూడా హాజరయ్యారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న‌ వీడియోను కాజల్‌ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది.

ప్రముఖ గాయకుడు కార్తిక్‌ తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా హాజరయ్యారు. కొద్దిసేపు వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు.