న‌న్ను ప‌దే ప‌దే వేధించార‌న్న రెజీన‌

రెజీనా కాసాండ్రా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. చ‌క్క‌ని న‌ట‌న‌తో పాటు అందాలు ఎర‌వేసి అందరి హృదయాలను దొంగిలించిన హాట్ గాళ్‌. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల‌తో రెజీనా విజ‌యాలు అందుకుంది. తొలి సినిమా ఎస్ఎంఎస్ త‌ర్వాత టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను సినిమాల‌కు సంత‌కాలు చేసింది. అయితే ఇటీవ‌ల కెరీర్ ఒడిదుడుకులు తెలిసిందే. నెక్ట్స్ లెవ‌ల్ కి చేరుకుంటుందని భావించినా రేసులో వెన‌క‌బ‌డింది. కొన్ని వ‌రుస ఫ్లాపుల‌తో డీలాప‌డిన‌ రెజీనా ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య`లో ఓ ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌నుంది.

అదంతా స‌రే కానీ.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ప‌దే ప‌దే వేధింపులు ఎదుర‌య్యాయ‌ని చెప్పి షాక్ ఇచ్చింది. చాలా మంది అనేక సందర్భాల్లో తనను వేధించడానికి ప్రయత్నించారని, ఒకసారి ఆమె అందరి సమక్షంలో ఒక వ్యక్తిని కొట్టాన‌ని తెలిపింది. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, చెన్నైలోని ప్రసిద్ధ థియేటర్ ఈగా సమీపంలో తాను త‌న‌ స్నేహితులు వేధింపులకు గురయ్యామ‌ని వెల్ల‌డించింది.

కొంతమంది కుర్రాళ్ళు తనపై చేయి వేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. స్నేహితుల విష‌యంలో అశ్లీల వ్యాఖ్యలు చేశార‌ని త‌న‌ పెదాలను తాకడానికి ప్రయత్నించారని రెజీనా వెల్లడించింది. ఇది తనకు షాక్ ఇచ్చిందని అన్నారు. బలహీనంగా ఉండ‌డం వ‌ల్ల‌నే అలా జ‌రిగింది. ఆడ‌పిల్ల‌లు ధృఢంగా ఉండాల‌ని సూచించింది.