‘ఇస్మార్ట్ శంకర్’కోసం పూరి ఇల్లు అమ్మేసాడా?!

‘ఇస్మార్ట్ శంకర్’కోసం పూరి ఇల్లు అమ్మేసాడా?!

మొత్తానికి పూరి జగన్నాథ్ కు రిలీఫ్ వచ్చింది. ఆయన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఈ మధ్యకాలంలో మాస్ ని టార్గెట్ చేస్తూ ఏ సినిమా రాకపోవటం ప్లస్ అయ్యింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే కలెక్షన్స్ దుమ్ము దులిపేసి, సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రారంభానికి ముందు పూరి ఉన్న పరిస్దితిని చాలా మంది తలుచుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ నిర్మాణం కోసం ఫైనాన్స్ ట్రై చేసారని,, అయితే దొరక్క పోవటంతో జూబ్లిహిల్స్ లో ఉన్న ఇంటిని అమ్మేసారని చెప్తున్నారు. అలాగే మరికొన్ని లాండ్స్ సైతం తనఖాకి పెట్టి అప్పు తెచ్చి మరీ సినిమా పూర్తి చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సినిమా కనుక తేడా కొడతే పరిస్దితి చాలా దారుణంగా ఉండేదని, అయితే ఇప్పుడు అప్పులన్నీ తీర్చేస్తున్నాడని అంటున్నారు. ఛార్మి సైతం తమ బ్యానర్ లో మరిన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులు చేయటానికి సిద్దపడుతోంది.

నిన్న ఆదివారం రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉన్నాయని చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు పడ్డాయి దీంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికే ఇస్మార్ట్‌ శంకర్‌ 50 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు. అలాగే వరస ప్లాప్ లత తరువాత పూరి జగన్నాథ్‌ ఈ స్దాయి హిట్‌ సాధించటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.