Puri Jagannath: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మనందరికి తెలిసిందే. ఒకప్పుడు మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన పూరి ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ను చవి చూస్తున్నాయి. ఇక చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్ సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. యూత్ ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.ఆ సంగతి పక్కన పెడితే.. ఇటీవలే పూరి జగన్నాథ్ కి హీరో దొరికాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలు పెట్టేశాడు పూరి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే, టబులాంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పుడు ఒక టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఆయన ఎవరో కాదు అక్కినేని నాగార్జున. హీరో నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. నాగార్జున హీరోగానే కాదు ఇప్పుడు సహాయక పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలోనూ నాగార్జున కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పూరి , సేతుపతి సినిమాలోనూ నాగ్ క్యామియో చేయనున్నారని అంటున్నారు. కాగా పూరి గత సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వడంతో ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎలా అయినా ఈ సారి సక్సెస్ ని అందుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నారు.