ఏంటిది రామ్..ఇలా చేసావ్ ? ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్

యంగ్ హీరో రామ్‌ గత ఏడాది ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో  వెనకపడ్డాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అయితే ఆ ప్లాఫ్ నుంచి బయిటపడేందుకు రామ్ ట్రెండ్ లో ఉన్న ఓ హిట్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నారు.

రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’.  నేను లోకల్, సినిమా చూపిస్త మామా వంటి ట్రెండీ ఫన్ హిట్ లు కొట్టిన త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత హీరోయిన్స్ గా చేస్తున్న  ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ప్రణీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

సున్నితమైన ప్రేమకథతో అందంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారని చెప్పబడుతున్న ఈ చిత్రం పాటలు ఇప్పటికే రిలీజైన సంగతి తెలిసిందే.  అందులో ఓ పాట ‘ఐడియా చెప్పు ఫ్రెండ్’. ఈ పాట కోసం రామ్, ప్రకాష్ రాజ్ తమ స్వరాలను కలిపారు.  అయితే ఫ్యాన్స్ ఈ పాటని అంతగా ఓన్ చేసుకోలేదు.


దానికి కారణం రామ్ పాట పాడుతున్నాడు అనగానే కొంత ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే వాళ్లు కేవలం పదాలు మాత్రమే రిధమిక్ గా పాడారు. చంద్రబోస్ గారు రాసిన ఆ పాట ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా సాగుతుంది. కొత్తగా ఉంది అని కొందరు అంటే…అబ్బే…పాట పాడతారు అనుకుంటే ఇలా మాటలతో ముగించేసారేంటి అంటున్నారు. అయితే ఇందులో ‘ఫ్రెండ్… ఫ్రెండ్… కొంచెం మార్చు ట్రెండ్…’ అన్న పదాలు మాత్రం
జనాలకు ఎక్కేటట్లు ఉన్నాయి.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.