ఫాల్కే వ‌ర్సెస్ ప‌ద్మ‌శ్రీ‌.. ఇదీ సంగ‌తి!

Will Tollywood intensify plans to shift to Visakhapatnam

రెండు వ‌రుస ఈవెంట్ల‌లో ఇద్ద‌రు టాప్ హీరోలు అవార్డుల గురించి ప్ర‌స్థావించారంటే దాని వెన‌క మ‌ర్మ‌మేమిటి? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ప్ర‌స్తుతం ఇదో హాట్ టాపిక్. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీరిలీజ్ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. త‌న మ‌న‌సులోని మాట‌ను య‌థాలాపంగానో యాథృచ్ఛికంగానో బ‌య‌ట‌పెట్టారు చిరు. అటుపై ఆ మాట‌పై సూప‌ర్ స్టార్ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

అయితే ఆ ఈవెంట్ అయిపోగానే మ‌రుస‌టి రోజు జ‌రిగిన అల వైకుంఠ‌పుర‌ములో ఈవెంట్లో అల్లు అర్జున్ ఎంతో ఎమోష‌న‌ల్ అవుతూ త‌న తండ్రి అల్లు అర‌వింద్ గురించి మాట్లాడారు. అలా మాట్లాడుతూ నాన్న‌కు ప్రేమ‌తో ఎంతో ఎమోష‌న్ అయిన బ‌న్ని.. ఉన్న‌ట్టుండి త‌న తండ్రికి ప‌ద్మ‌శ్రీ ఇవ్వాల‌ని ప‌రిశ్ర‌మ‌కు అంత‌గా సేవ‌లందించిన వేరొక వ్య‌క్తి లేడ‌ని పొగిడేశాడు. అయితే బ‌న్ని ఇలా ఎమోష‌న్ అవ్వ‌డం వెన‌క అస‌లు కార‌ణ‌మేమిటి? అంటే.. కృష్ణ విష‌యంలో చిరు అంత గొప్ప అభ్య‌ర్థ‌న చేశారు. పైగా త‌న వేడుక‌లో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉండాల‌నుకున్నాడు. ప‌నిలో ప‌నిగా తండ్రితో ఆస్తి పంప‌కాలు.. వేరు కుంప‌టి అంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు చెక్ పెట్టేయాల‌న్న ఉద్ధేశంతోనే అలా చేశాడు బ‌న్ని. ప్ర‌స్తుతం దీనిపై బ‌న్ని ఫ్యాన్స్ లోనే ఆక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.