అఖిల్ తో చిత్రం విషయమై క్రిష్..ఏమన్నారంటే

గత కొద్ది రోజులుగా క్రిష్ దర్శకత్వంలో అఖిల్ తదుపరి చిత్రం రాబోతోందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆ సినిమాలో నాగార్జున కూడా నటించబోతన్నారంటూ రూమర్ పుట్టించారు. దాంతో సోషల్ మీడియాలో కొందరు అఖిల్ ఫ్యాన్స్…క్రిష్ గొప్ప దర్శకుడే కావచ్చు కానీ ఇప్పుడు అఖిల్ మాత్రం ఆయనతో చేసే టైమ్ కాదంటూ పోస్ట్ లు పెట్టసాగారు. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవటంతో ఆయన రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంల ఈ వార్త హల్ చల్ చేసింది. అయితే క్రిష్ చెందిన టీమ్ ఈ వార్తలను కొట్టిపారేసింది.

క్రిష్ ..తన తదుపరి చిత్రం విషయమై ఏ విధమైన డెసిషన్ తీసుకోలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆయన ఈ నెలలో రిలీజ్ కానున్న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై కాన్సర్టేషన్ పెట్టారని, వేరే ఆలోచనలు లేవని తేల్చి చెప్పుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రమే తన తదుపరి ప్రాజెక్టు విషయమై ఆలోచిస్తారని అన్నారు.

మరో ప్రక్క అఖిల్ ఫారిన్ వెకేషన్ కు వెళ్తున్నారు. ఈ నెలాఖరకు హైదరాబాద్ వస్తారు. వచ్చాక ఆయన తదుపరి చిత్రం ఫైనలైజ్ కానుంది. కాబట్టి అప్పటివరకూ గప్ చుప్. అఖిల్, క్రిష్ లు ఇద్దరూ ఏ ప్రాజెక్టును తమ తదపరి సినిమాగా ప్రకటిస్తారో వెయిట్ చేయాలి. అఖిల్ తో చేయటానికి పెద్ద క్యూ డైరక్టర్స్ మాత్రం వెయిటింగ్ అన్నది మాత్రం నిజం.

ఓ ప్రక్క క్రిష్‌ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతున్నారు. మహానాయకుడు పూర్తియ్యాక ఆయన కొద్ది నెలలు పాటు రెస్ట్ తీసుకుని తదుపరి ప్రాజెక్టులోకి వెళ్తారు. అయితే ఆయన అఖిల్ తో చేస్తారా..మరో హీరోతో చేస్తారో చూడాలి.