ఆమె అప్పుడే బెంగుళూరు నుంచి దిగుమతైన మోడల్. అప్పటికే టాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. కానీ సరైన ఫలితం దక్కలేదు. దీంతో కొన్నాళ్లు ఖాళీగానే ఉంది. అందం, అభినయం గల నటి. సరిగ్గా అప్పుడే టాలీవుడ్ కి ఓ యంగ్ డైరెక్టర్ వచ్చాడు. అప్పటికే ప్లాప్ ల్లో ఉన్న ఓ హీరోని తీసుకుని డిఫరెంట్ జానర్ సినిమా చేసాడు. అందులో ఎలాగూ అవకాశం అందుకుంది ఆ నటి. అప్పటి నుంచి ఆ నటిమణి డైరెక్టర్ తో సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టిందిట. ఆ బంధం మరీ వీడదీయరాని బంధంగా మారిపోవడంతో హైదరాబాద్ లోనే ప్లాట్ తీసుకుని ఉంది. లక్కీగా ఆ డైరెక్టర్ కి తొలి సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తదుపరి ఓ పెద్ద హీరోతో సినిమా చేసాడు.
అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అప్పటికే ఆ డైరెక్టర్ తో అమ్మడు చాటు మాటు వ్యవహారం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నలిగింది. దీంతో తదుపరి రెండు చిత్రాల్లోనూ సదరు దర్శకుడు అవకాశాలివ్వలేదు. అలాగని ఆ బంధం వీగిపోలేదు. కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలే వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరు విడిపోయారని ఆ నటి తిరిగి బెంగుళూరు వెళ్లిపోయిందని సమాచారం. ఈ చాటు మాటు వ్యవహారం సదరు డైరెక్టర్ సతీమణికి కూడా తెలిసిందిట. కానీ ఆమె సినిమా ఇండస్ర్టీలో ఇలాంటివి సహజంగా ఉండేవేనని లైట్ తీసుకుందిట.
శ్రీరాముడు లాంటి భర్తలు ఎంత మందికి ఉన్నారని సర్దుకుపోయిందంటున్నారు. వరుస పరాజయాల నడుమ ఆ డైరెక్టర్ ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. తనకు కెరీర్ ని ఇచ్చిన హీరోతోనే మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ స్ర్కిప్ట్ పూర్తయింది. నటీనటులు..సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసి సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో లాక్ డౌన్ విధించడంతో పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలిసిందే.