ఒక్క‌డు సీక్వెల్ ప్లాన్‌లో దిల్ రాజు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ – గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ మూవీ ఒక్క‌డు ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించిన ఈ సినిమాలో మ‌హేష్ – భూమిక మ‌ధ్య ల‌వ్ స్టోరి.. ప్ర‌కాష్ రాజ్ – మ‌హేష్ మ‌ధ్య స‌న్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఫ్యామిలీ ఎపిసోడ్ అంతే మెప్పిస్తుంది. 

స్క్రీన్ ప్లే ప‌రంగా ది బెస్ట్ మూవీ ఇది. ప‌ర్ఫెక్ట్ స్క్రిప్ట్ కుదిరిన సినిమా కూడా. అలాగే మ‌ణిశ‌ర్మ బాణీలు బంప‌ర్ హిట్. అయితే ఆ సినిమా తెర‌కెక్కి ఇన్నేళ్లు అయినా ఇంకా ఆ త‌ర‌హా స్క్రిప్టు ఏదీ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని వ‌స్తే వెంట‌నే దానిని తెర‌కెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించారు. ఎవ‌రైనా అలాంటి స్క్రిప్టుతో వ‌స్తే హీరోని సిద్ధం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఎంద‌రో హీరోల‌తో ఎన్నో సినిమాలు తీసినా అలాంటి సినిమా తీయ‌లేద‌ని అన్నారు. ఇక ఒక్క‌డు రిలీజ్ టైమ్ లోనే తాను నిర్మాత‌గా ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని.. వినాయ‌క్ తో దిల్ కోసం ప‌ని చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు.