నిర్మాత చార్మి ఇంట విషాదం

న‌టి, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటు చేసుకుంది. చార్మి కుటుంబంలో ఒక‌రైన, చార్మికి బాగా ఇష్ట‌మైన ఆమె అత్త క‌న్నుమూసారు. ఆమెది హ‌ఠాన్మ‌ర‌ణం అని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చార్మి భావోద్వేగంతో పెట్టిన ఓ పోస్ట్ సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోంది. అత్త‌మ్మ మీరు లేర‌ని మాట‌ని న‌మ్మ‌లేక‌పోతున్నా. ఆలోటును తీర్చ‌లేనిది.నిన్నే వీడియో కాల్ లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివ‌రి ఫోన్ కాల్ అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయాన‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. మీరు వెళ్లిన చోటు కూడా మీకు న‌చ్చిన‌ట్లుగా ఉంటారనుకుంటున్నా. అక్క‌డ కూడా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తార‌ని అనుకుంటున్నాను.

మీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని చార్మి ట్వీట్ చేసింది. అలాగే అత్త‌మ్మ‌తో క‌లిసి దిగ‌తిన ఓపాత ఫోటోని పోస్ట్ చేసింది. అత్త‌మ్మ‌తో ఉన్న మ‌ధుర జ్ఞాప‌క‌ల్ని గుర్తు చేసుకుని ఎమోష‌న్ అయింది. ప్ర‌స్తుతం చార్మి టాలీవుడ్ లో నిర్మాత‌గా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి నిర్మాత‌గా పెట్టుబ‌డులు పెట్టి సినిమాలు నిర్మిస్తోంది. పూరి క‌నెక్స్ట్ పేరుతో జ‌రుగు తోన్న సినిమాల నిర్మాణం మొత్తాన్ని చార్మీనే చూసుకుంటోంది. కొన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ ఆ మధ్య ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో భారీగా లాభాలు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి `ఫైట‌ర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డింది. నటి గా కొన్నాళ్లు కొన‌సాగిన చార్మికి ఆ త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గ‌డంతో సినిమాల‌పై ఫ్యాష‌న్ తో నిర్మాణ రంగంలోకి దిగింది. ఆమెకు పూరి స‌హ‌కారం తోడ‌వ్వ‌డంతో నిర్మాతగా  త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పేరొచ్చింది.