“లైగర్” ఎఫెక్ట్ : సోషల్ మీడియాకి సెలవు అంటున్న చార్మీ కౌర్.!

ఈ ఏడాది లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లోనే ఓ భారీ డిజాస్టర్ గా “లైగర్” సినిమా ఇప్పుడు నిలిచిపోయింది. ఈ ఏడాదిలో మెగాస్టార్ నటించిన “ఆచార్య” సినిమానే అనుకుంటే ఇది దాన్ని దాటేసి ఆ నెగిటివిటి ని దీనిపైకి తెచ్చుకుంది.

అయితే లైగర్ దెబ్బతో విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి తో సినిమా చేయకూడదు అనుకున్నాడో ఏమో కానీ అప్పటికే ఓకే చేసిన “జనగణమణ” ఆపేసాడు. దీనితో సినిమా నిర్మాతలకు కూడా ఎలాంటి అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఛార్మి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ బిగ్ స్టేట్మెంట్ అని అయితే ఇచ్చింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా ని వదిలేస్తున్నానని మళ్ళీ బ్రేక్ తీసుకొని మంచి సినిమాతో వస్తామంటూ పోస్ట్ చేసింది. మరి ఈ పోస్ట్ కి కూడా కామెంట్స్ ఆఫ్ చేసేయడం కొస మెరుపు.

దీనితో అయితే లైగర్ ఎఫెక్ట్ మాత్రం ఈ సినిమా విషయంలో వారికి గట్టిగానే పడింది అని చెప్పాలి. మరి ఈ బ్రేక్ ఇంకెంత కాలం ఉంటుందో? పూరి ఏ హీరోని పట్టుకొని ఒప్పించి వస్తాడో చూడాలి. ప్రస్తుతం అయితే ఛార్మి పోస్ట్ వైరల్ గా అవుతుంది.