ప్ర‌భాస్ `జాన్` స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారా?

ప్ర‌భాస్ 20 స్క్రిప్టులో గ‌ప్ చుప్ మార్పులా?

డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సాహో ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాదిన ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రం ద‌క్షిణాదిన బ‌య్య‌ర్ల‌కు తీవ్ర న‌ష్టాల్ని మిగిల్చింద‌ని ఎన‌లిస్టులు తేల్చి చెప్పారు. అయితే ఈ ఫ్లాప్ ప్ర‌భావం ప్ర‌భాస్ న‌టించ‌నున్న త‌దుప‌రి చిత్రంపై ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ప్ర‌భాస్ 20 స్క్రిప్టులో మార్పు చేర్పుల్ని డార్లింగ్ సూచించార‌ట‌. ఆ మేర‌కు జిల్ రాధాకృష్ణ‌తో క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. సాహో ఫలితం చూశాక .. ఈ మార్పులు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌భాస్ భావించారు. అందుకే సీరియ‌స్ గా దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇటీవ‌లే కొద్ది రోజులుగా ప్యారిస్ లో రిలాక్స్ అయిన డార్లింగ్ ఆ ట్రిప్ ని ముగించుకుని తిరిగి హైద‌రాబాద్ కి విచ్చేశారు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో త‌దుప‌రి చిత్రాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంత‌కుముందు ఒక షెడ్యూల్ ని చిత్రీక‌రించార‌ని.. సెట్స్ వేశార‌ని ప్ర‌చార‌మైంది. ప్ర‌స్తుతం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు కాబ‌ట్టి .. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుంచి అన్న‌ది తేలాల్సి ఉంది.