బ‌న్ని డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ట‌ !

ఫ్యాన్స్‌కి అల్లూ హీరో డ‌బుల్ ట్రీట్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `నాపేరు సూర్య` రిలీజై ఇప్ప‌టికే ఏడాదిన్న‌ర పైగానే అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు న‌టించిన వేరొక సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. `నా పేరు సూర్య‌: నా ఇల్లు ఇండియా` డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బ‌న్ని కేవ‌లం స్క్రిప్టు ఎంపిక‌కే ఏడాది పైగా స‌మ‌యం తీసుకున్నారు. ఇటీవ‌లే త్రివిక్ర‌మ్ తో సినిమాని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉన్న సంగ‌తి విదిత‌మే. త‌దుప‌రి శ్రీ‌రామ్ ఆదిత్య‌, సుకుమార్ ల‌తో సినిమాల్ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఏఏ 19 త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఏఏ 20 శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో .. ఏఏ 21 సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. శ్రీ‌రామ్ ఆదిత్య‌తో చిత్రానికి ఐక‌న్ అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు.

అయితే ఇటీవ‌ల ఈ రెండు సినిమాలకు సంబంధించి స‌రైన స‌మాచారం లేదు. రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న‌దానిపైనా స‌రైన‌ స్ప‌ష్ట‌త లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ రెండు సినిమాల్ని ఇంచుమించు ఒకేసారి ప్రారంభించే వీలుంద‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకెళతార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఈ రెండు చిత్రాల్ని ఏక కాలంలో పూర్తి చేసి వ‌చ్చే ఏడాదిలో రిలీజ్ చేసే వీలుంద‌ని భావిస్తున్నారు. 2019 లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా రిలీజ‌వుతుంది. 2020లో ఐక‌న్ తో పాటు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంద‌ట‌. వ‌చ్చే ఏడాది ఫ్యాన్స్ కి బ‌న్ని నుంచి డ‌బుల్ ట్రీట్ ఖాయం అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఆగ‌స్టు 15న బ‌న్ని- త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్- ఫ‌స్ట్ లుక్ ని లాంచ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.