బిజెపిలో చేరిన మాజీ హీరోయిన్ ప్రియరామాన్

ప్రియ రామన్ అందరికీ సుపరిచితమైన హీరోయిన్ చాలా కాలం నుంచి పొలిటికల్ ఎంట్రీ అని వార్తలు వచ్చిన తరుణంలో తను తిరుపతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి నటి ప్రియారామన్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకెంతో అభిమానమని.

మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ప్రియారామన్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. కేరళలో జన్మించిన ప్రియారామన్..తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించారు.