సాగర్‌లో బీజేపీకి షాక్.. రెబల్ అభ్యర్థిగా ఆ కీలక నేత నామినేషన్ ?

BJP digging its own grave

తెలంగాణ లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలని మరోసారి వేడెక్కించింది. సోమవారం బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్‌ నామినేషన్‌ వేయనున్నారు. త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన పానుగోతు రవికుమార్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ వైద్యుడిగా, ప్రజా సేవకుడిగా రాణిస్తున్నారు.రవికుమార్‌ ప్రస్తుతం రవికుమార్‌ హాలియాలో ఉంటూ ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తిరుమలగిరి జడ్పీటీసీగా పోటీ చేసిన రవికుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

BJP's development comed on Tirupathi By Poll

మాజీ మంత్రి జానారెడ్డి అనుచరుడిగా ఎదిగిన రవికుమార్.. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించి బీజేపీలో పార్టీలో చేరారు. ఆయన సతీమణి సంతోషి కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలుపొంది ఇటీవల బీజేపీలో చేరారు. అయితే, సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి తలనొప్పి తప్పేలా లేదు. పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా కడారి అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఇండిపెండెంట్‌గా అంజయ్య యాదవ్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించిన నివేదితా రెడ్డి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, పార్టీ అధిష్టానం రవికుమార్‌కు ఛాన్స్ ఇవ్వడంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు నివేదితారెడ్డి. మంగళవారం నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటానని చెప్పారు. దీంతో బీజేపీ రాష్ట్ర నేతల్లో టెన్షన్‌ మొదలైనట్లు సమాచారం. సొంత పార్టీ నేత రెబల్‌గా నామినేషన్ దాఖలు చేస్తే పరిస్థితి ఏంటి? అన్న దానిపై రాష్ట్ర పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, సభలు లేకుండా సాదాసీదాగా ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ వేయనున్నారు. అటు బీజేపీ అభ్యర్థి రవికుమార్ నామినేషన్ కు ఎమ్మెల్యే రాజా సింగ్, ఇంచార్జ్ లు సంకినేని వెంకటేశ్వరరావు, చాడా సురేష్ రెడ్డి హాజరు కానున్నారు.