కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లను ధ్వంసం చేశారు. అంతేగాక సీఎం ఇంటి గోడలపై పెయింటింగ్‌ పూశారు. అడ్డుకున్న పోలీసులతో కార్యకర్తలు గొడవకు దిగారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.