బాల‌య్య- రానా మ‌ల్టీస్టార‌ర్ అట‌కెక్కిన‌ట్టేనా?

మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన `అయ్యప్పనమ్ కోషియం` ఇరుగు పొరుగు భాష‌ల్లో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో జాన్ అబ్ర‌హాం ఈ సినిమా రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకుని తాను స్వ‌యంగా న‌టిస్తూ నిర్మించ‌నున్నాడు. త‌మిళంలో సూర్య‌-కార్తీ బ్ర‌ద‌ర్స్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. టాలీవుడ్ లో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ సినిమా రైట్స్ ని చేజిక్కించుకుంది.

అయితే తెలుగు వెర్ష‌న్ కి వ‌స్తే… ఈ సినిమా రీమేక్ లో ఎవ‌రు న‌టిస్తారు? అన్నది ఇంకా స‌స్పెన్స్ గా మారింది. ఇప్ప‌టికే సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత‌లు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ద‌గ్గుబాటి రానాల్ని సంప్ర‌దించారు. అయితే బాల‌య్య ఈ మూవీపై ఏమాత్రం ఆస‌క్తిగా లేర‌ని .. ఆయ‌న ఈ చిత్రం చేయ‌డం లేద‌ని ప్ర‌చార‌మైంది. రానా చేస్తాన‌ని ప్రామిస్ చేసినా కానీ ఇంకా తెలుగు వెర్ష‌న్ స్క్రిప్టు రెడీ అయితే కానీ చెప్ప‌లేను అని స‌స్పెన్స్ లో ఉంచాడ‌ట‌.

దీంతో ఇంకా ప్ర‌ధాన న‌టుల వేట సాగుతూనే ఉంది. ఇలా అయితే తెలుగు వెర్ష‌న్ రిస్కులో ప‌డిన‌ట్టేన‌న్న టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌గా స్క్రిప్టు రెడీ చేసి హీరోల్ని ఒప్పిస్తే ప‌నవుతుందేమో! మరి ఆ ప‌నిలోనే ఉన్నారా? అన్న‌ది చూడాలి. కొన్నిటిని వేడిగా ఉన్న‌ప్పుడే వ‌డ్డించాలి. లేదంటే ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది.