`బాహుబ‌లి`నా మ‌జాకా?

                                                                           (ధ్యాన్)
                 

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం `బాహుబ‌లి`. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్ వంటి ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రం మొత్తంగా దాదాపు 2400 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి తెలుగు సినిమా మార్కెట్‌ను అమాంతంగా పెంచేసింది. అంతే కాకుండా కొత్త క‌థ చిత్రాల‌కు, చిన్న చిత్రాల‌కు మార్కెట్ ప‌రంగా కొత్త ఊపిరినిచ్చింది. వ‌సూళ్ల ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు సైమాలో ఏకంగా 12 అవార్డుల‌కు నామినేట్ కావ‌డం విశేషం. ఉత్తమ చిత్రం, నటుడు, నటి,సంగీత దర్శకుడు,  సహాయ నటుడు, సహాయ నటి, ప్లే బ్యాక్‌ సింగర్‌ మేల్‌ అండ్‌ ఫీమేల్‌, సినిమాటోగ్రఫర్‌, దర్శకుడు, పాటల రచయిత విభాగాల్లో బాహుబ‌లి నామినేట్ అయింది.