బాహుబ‌లి కోసం ప్ర‌వీణ్ స‌త్తారు…

                                                    (మోహన్ కుమార్) 

`చంద‌మామ‌క‌థ‌లు, గుంటూరు టాకీస్‌, పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శకుడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఇప్పుడు బాహుబ‌లి సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట. వివ‌రాల్లోకెళ్తే.. నెట్‌ఫిక్స్ సంస్థ బాహుబ‌లిలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌ను ఆధారంగా చేసుకుని `ది రైజ్ ఆఫ్ శివ‌గామి` అనే వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌బోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించిన  ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఇంత‌కు ముందు ఈ సిరీస్‌ను రాజ‌మౌళి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేవాక‌ట్టా డైరెక్ట్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ దేవా క‌ట్టాతో పాటు ప్ర‌వీణ్ స‌త్తారు కూడా ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. వెబ్ సిరీస్ 9 భాగాలుగా ఉంటుంది.