అమ‌లాపాల్ `ల‌స్ట్ స్టోరీస్`.. వేడెక్కించ‌డం గ్యారెంటీ

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌ ట్రెండ్ న‌డుస్తోంది. స‌మంత, రాధిక ఆప్టే, ప్రియ‌మ‌ణి, నిహారిక లాంటి క‌థానాయిక‌లు ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల‌ బాట‌లో ఉన్నారు. ప‌లువురు టాలీవుడ్ స్టార్లు వెబ్ సిరీస్ బాట ప‌డుతున్నార‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాలీవుడ్ హిట్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్`ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రోనీ స్క్రూవాలా ఆ మేర‌కు ఇప్ప‌టికే ప‌ని మొద‌లు పెట్టారు. 
 
ఈ వెబ్ సిరీస్ కోసం న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తున్నార‌ని స‌మాచారం. తెలుగు `ల‌స్ట్ స్టోరీస్`కి నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, సంక‌ల్ప్ రెడ్డి, త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నందిని రెడ్డి వెర్ష‌న్ సిద్ధ‌మైంది. త్వ‌ర‌లో సెట్స్ కి వెళ్ల‌నున్నారు. ఇక ఇందులో అమ‌లాపాల్ న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇత‌ర ద‌ర్శ‌కులు క‌థ‌ల్ని రెడీ చేస్తున్నారు. ల‌స్ట్ స్టోరీస్ అనేది ర‌క‌ర‌కాల క‌థ‌ల్ని ఒకే థీమ్ క‌నెక్టివిటీతో రూపొందించిన సిరీస్. తెలుగులోనూ ఈ సిరీస్ అభిమానుల్ని అల‌రించ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ప్రేమ‌..ల‌స్ట్ మ‌ధ్య వైరుధ్యాన్ని ఈ వెబ్ సిరీస్ లో చూపించ‌నున్నారు. అమ‌లాపాల్ లాంటి ఎమోష‌న‌ల్ పెర్ఫామ‌ర్ ఈ సిరీస్ కి ప్ల‌స్ కానుంద‌ని నందినిరెడ్డి చెబుతున్నారు. ల‌స్ట్ స్టోరీస్ లో ఓ పాత్ర కోసం జ‌గ‌ప‌తిబాబును ఎంపిక చేశార‌ట‌.