‘‘శర్వా నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. అందుకే గారు అంటున్నాను. ఈ మధ్యలో టీవీల్లోను, సమాజంలో సినిమా, రాజకీయ నాయకులని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. ‘గారు’ అని ఒక గౌరవం ఇవ్వండి.
ఒకసారి టీవీలో చూస్తుంటే ఎవరో చిరంజీవిని పిలు అన్నారు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్గారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి. వినడానికి కొంచెం ఆర్టిఫీఫియల్గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి” అంటూ క్లాస్ పీకారు అల్లు అర్జున్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ గారూ అంటూ ట్యాగ్ పెట్టి ట్వీట్స్ వేస్తున్నారు.
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘పడిపడి లేచె మనసు’. డిసెంబర్ 21న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ ఇలా మాట్లాడారు.