ఫ్లాఫ్ డైరక్టర్ చేతిలో పెడుతున్నావేంటి పూరి?

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా మంది హీరోలను స్టార్స్ చేసారు. వారి కెరీర్ లో బెస్ట్ అనుకునే సినిమాలు ఇచ్చారు. అయితే చిత్రంగా తన కొడుకు కెరీర్ కు మాత్రం సరైన హిట్ అందించలేకపోయారు. పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారి, అతని కెరీర్ కు ఆదిలోనే బ్రేక్ వేసేసింది.

దాంతో ఆకాష్ రెండో చిత్రాన్ని తన అశోసియేట్ అయిన అనిల్ పాడూరి చేతిలో పెట్టాడు. ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు.

ఆకాష్ తన మూడవ సినిమాని కత్తి మల్లి(మల్లి కార్జున్) దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఇంతకు ముందు మల్లికార్జున్ కళ్యాణ్ రామ్ హీరోగా ‘అభిమన్యు’, ‘కళ్యాణ్ రామ్ కత్తి’, ‘షేర్’ సినిమాలను తెరకెక్కించాడు. ఏ సినిమా కూడా ఆడలేదు. అయితే యాక్షన్ సీన్స్ బాగా డీల్ చేస్తాడనే పేరు ఉన్న ఈ దర్శకుడు చేతిలో పెడితే తన కొడుకు యాక్షన్ హీరోగా నిలబడే అవకాసం ఉందని పూరి భావించాడట. అంతేకాదు ఈసారి మంచి స్టోరీ లైన్ తో మల్లి వచ్చాడని అందుకే పూరి కూడా ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.