‘నెంబర్ వన్’ విలన్ మహేష్ ఆనంద్ మృతి

అప్పట్లో కృష్ణ హీరోగా వచ్చిన ‘నెంబర్ వన్’ చిత్రంలో విలన్ గా చేసిన మహేష్ ఆనంద్ ని మర్చిపోవటం కష్టమే. చిత్రమైన మ్యానరిజంతో ఆ సినిమాలో కనిపిస్తారు. ఆ చిత్రం తర్వాత పాపులర్ విలన్‌గా ఎదిగిన మహేష్ ఆనంద్ ఈ రోజు (ఫిబ్రవరి 9) ముంబైలోని తన ప్లాట్ లో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్‌కి తరలించారు.

బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించిన ఈయన చివరగా గోవిందా హీరోగా వచ్చిన ‘రంగీలా రాజా’ సినిమాలో కనిపించారు. ఈ జనవరి 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘‘కురుక్షేత్ర, స్వరాజ్, కూలీ నెంబర్ 1, విజేత’’ లాంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.